అపొస్తలుల కార్యములు 9:36–42
“బహుగా సత్క్రియలు చేసియున్న” తబితా అనే స్త్రీ
యేసు క్రీస్తు శక్తి ద్వారా తిరిగి బ్రతికించబడింది
తబితా యేసు క్రీస్తుకు నమ్మకమైన శిష్యురాలు. ఆమె సముద్ర తీరాన ఉన్న యొప్పే అనే పట్టణంలో నివసించేది. పేద ప్రజలకు సేవ చేయడం మరియు సహాయం చేయడం ఆమెకు చాలా ఇష్టం.
అపొస్తలుల కార్యములు 9:36
తబితా బట్టలు కుట్టి అవసరంలో ఉన్న స్త్రీలకు ఇచ్చేది. వారు తబితాను ప్రేమించారు.
అపొస్తలుల కార్యములు 9:39
ఒకరోజు, తబితా చాలా అనారోగ్యానికి గురైంది. ఆమె చాలా అనారోగ్యంతో చనిపోయింది.
అపొస్తలుల కార్యములు 9:37
యొప్పేలోని ఇతర సంఘ సభ్యులు చాలా విచారంగా ఉన్నారు. యేసు అపొస్తలులలో ఒకరైన పేతురు దగ్గరలోని ఒక పట్టణంలో ఉన్నాడని వారికి తెలుసు. పేతురును త్వరగా తమ దగ్గరకు రమ్మని చెప్పడానికి వారు ఇద్దరు మనుష్యులను పంపారు.
అపొస్తలుల కార్యములు 9:38
పేతురు తబితా శరీరం ఉంచిన చోటుకు వచ్చాడు. తబితా సహాయం చేసిన కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారు. తమ కోసం ఆమె చేసిన బట్టలను వారు పేతురుకు చూపించారు.
అపొస్తలుల కార్యములు 9:39
పేతురు అందరినీ గదినుండి బయటకు వెళ్లమని చెప్పాడు. ఆయన మోకరించి ప్రార్థించెను.
అపొస్తలుల కార్యములు 9:40
ప్రార్థించిన తరువాత పేతురు, “తబితా, లేచి నిలువు” అని చెప్పాడు. ఆమె కన్నులు తెరిచి లేచి కూర్చుంది. తబితా నిలబడటానికి పేతురు సహాయం చేశాడు. తబితా మరలా సజీవురాలయ్యెను! వచ్చి తనను చూడమని పేతురు తన స్నేహితులను పిలిచాడు. వారు ఆశ్చర్యపోయారు! ఆమె యేసు క్రీస్తు శక్తి ద్వారా తిరిగి బ్రతికించబడిందని వారికి తెలుసు. ఇంకా చాలా మంది ఆయనయందు విశ్వాసముంచిరి.
అపొస్తలుల కార్యములు 9:40–42