మత్తయి 8:23–27; మార్కు 4:36-41
యేసు తుఫానును శాంతింపజేస్తారు
గాలి మరియు సముద్రం కూడా ఆయనకు లోబడతాయి
ఒకరోజు, యేసు మరియు ఆయన శిష్యులు గలిలయ సముద్రంలో ఒక పడవలో ప్రయాణిస్తున్నారు. గాలి చాలా బలంగా వీచడం ప్రారంభించింది. అలలు పడవను నీటితో నింపడం ప్రారంభించాయి. అయితే, యేసు ప్రశాంతంగా నిద్రించుచున్నారు.
మత్తయి 8:23–24
శిష్యులు భయపడ్డారు. వారు యేసును నిద్ర లేపారు. “ప్రభువా, మమ్మును రక్షించుము,” అని వారు కేకలు వేశారు. వాళ్ళు సముద్రంలో మునిగిపోతామని అనుకున్నారు.
మత్తయి 8:25
“మీరెందుకు భయపడుతున్నారు?” అని యేసు అడిగారు. శిష్యులు మరింత విశ్వాసం కలిగి ఉండాలని ఆయన వారితో చెప్పారు. తరువాత ఆయన లేచి నిలబడి గాలితో మరియు సముద్రముతో, “నిశ్శబ్దమై ఊరకుండుమని” అన్నారు.
మత్తయి 8:26; మార్కు 4:39
వెంటనే తుఫాను ఆగిపోయింది, సముద్రం ప్రశాంతంగా ఉంది. యేసు మరియు శిష్యులు సురక్షితంగా ఉన్నారు. యేసు యొక్క శిష్యులు ఆశ్చర్యపోయారు. వారు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి!
మత్తయి 8:26–27