లేఖన కథలు
యేసు వేలాది మందికి ఆహారం ఇచ్చారు—ఆయనే జీవాహారము


మత్తయి 14:13–21; యోహాను:6

యేసు వేలాది మందికి ఆహారం ఇచ్చారు

ఆయనే జీవాహారము

యేసు ఒంటరిగా సమయం గడుపుతున్నారు.

బాప్తిస్మమిచ్చు యోహాను చంపబడ్డాడని యేసు కనుగొన్నారు. ఆయన ఒంటరిగా కొంత సమయం గడపడానికి పట్టణాలకు దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళారు.

మత్తయి 14:13

యేసు ఒక జనసమూహముతో మాట్లాడుతున్నారు.

యేసు ఎక్కడికి వెళ్ళారో ప్రజలు విని ఆయనను వెంబడించారు. యేసు వారిని చూశారు, మరియు ఆయనకు వారిపై ప్రేమ కలిగింది. ఆయన రోజంతా వారిని ఆశీర్వదిస్తూ, స్వస్థపరుస్తూ గడిపారు.

మత్తయి 14:13–14

ప్రజలకు తినడానికి ఏదైనా ఇవ్వమని యేసు అపొస్తలులను అడుగుతారు.

దినము ముగిసే సమయానికి, ప్రజలకు ఆకలి వేయడం ప్రారంభమైంది. ఆహారం కోసం పట్టణాలకు తిరిగి వెళ్లమని, యేసు ప్రజలకు చెప్పాలని అపొస్తలులు భావించారు. కానీ యేసు వారు అక్కడే ఉండాలని కోరుకున్నారు. ప్రజలకు తినడానికి ఏదైనా ఇవ్వమని ఆయన అపొస్తలులను అడిగారు.

మత్తయి 14:15–16

కొద్దిపాటి ఆహారం ఉన్న ఒక బాలుడిని అంద్రెయ కనుగొన్నాడు.

అపొస్తలుడైన అంద్రెయ ఒక బాలుడిని కనుగొన్నాడు, అతని వద్ద ప్రజలకు ఇవ్వడానికి ఐదు రొట్టెలు మరియు రెండు చిన్న చేపలు ఉన్నాయి. కానీ తినవలసిన అవసరం ఉన్నవారు 5,000 మంది పురుషులు, అలాగే స్త్రీలు మరియు పిల్లలు ఉన్నారు. ఇంత తక్కువ ఆహారంతో వాళ్ళు ఇంత మందికి ఎలా తినిపించగలిగారు?

మత్తయి 14:17, 21; యోహాను 6:8–10

యేసు ప్రార్థన చేసి ఆహారాన్ని ఆశీర్వదిస్తారు.

యేసు తన దగ్గరకు ఆహారాన్ని తీసుకురావాలని అపొస్తలులను అడుగుతారు. ఆయన జనసమూహమును పచ్చిక మీద కూర్చోమని చెప్పారు. తరువాత యేసు రొట్టె మరియు చేపల కోసం పరలోక తండ్రికి కృతజ్ఞతలు చెప్పి దానిని ఆశీర్వదించమని ప్రార్థన చేశారు. తరువాత ఆయన రొట్టెను, చేపలను ముక్కలుగా విరిచారు.

మత్తయి 14:18–19; యోహాను 6:10–11

అపొస్తలులు ప్రజలకు ఆహారం పెట్టారు.

యేసు తన అపొస్తలులను ప్రజలకు రొట్టెలు, చేపలు ఇవ్వమని అడిగారు. అందరూ కడుపునిండా తిన్నారు. వారు తినిన తర్వాత కూడా మిగిలిపోయిన ఆహారం ఇంకా 12 బుట్టల నిండా ఉంది!

మత్తయి 14:20; యోహాను 6:11–13

ప్రజలు మళ్ళీ ఆహారం కోసం వెతుకుతూ తిరిగి వస్తారు.

మరుసటి రోజు, ప్రజలు తిరిగి వచ్చి మళ్ళీ యేసును కనుగొన్నారు. కానీ యేసు వారికి ఆహారం ఇచ్చినందున వారిలో చాలామంది తనను వెంబడిస్తున్నారని ఆయనకు తెలుసు. ఆహారం కొద్దిసేపు మాత్రమే ఉంటుందని యేసు వారికి గుర్తు చేశారు. వారికి ఇవ్వడానికి అంతకంటే మంచిది ఆయన దగ్గర ఉంది.

యోహాను 6:14, 24–27

యేసు ఆయనే జీవాహారమును అని బోధిస్తున్నారు.

“జీవాహారము నేనే,” అని యేసు చెప్పెను. రొట్టె మనకు భూమిపై జీవితాన్ని ఇస్తుంది. కానీ యేసు క్రీస్తు మనకు పరలోక తండ్రితో నిత్యజీవమును ఇవ్వగలరు.

యోహాను 6:35–58

యేసు బోధిస్తున్న దానిని బట్టి ప్రజలు అసంతృప్తి చెందారు.

యేసు బోధిస్తున్నది చాలామందికి నచ్చలేదు. వారు వెళ్ళిపోయి ఇక యేసును అనుసరించకూడదని నిర్ణయించుకున్నారు.

యోహాను 6:60, 66

అపొస్తలులు ఆయనను విడిచిపెట్టరని పేతురు యేసుతో చెప్పాడు.

అప్పుడు యేసు తన అపొస్తలులతో, “మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా?” అని అడిగాడు. “ప్రభువా, యొవని యెద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు,” అని పేతురు జవాబిచ్చాడు. అపొస్తలులు వెళ్ళిపోలేదు. యేసు క్రీస్తు రక్షకుడని మరియు దేవుని కుమారుడని వారికి తెలుసు.

యోహాను 6:67–69