లూకా 24:1–12, 36–49; యోహాను 20
ఆయన లేచియున్నారు
అందరి కొరకు యేసు క్రీస్తు మరణాన్ని జయించారు
యేసు శిష్యులు ఆయన శరీరాన్ని సమాధిలో ఉంచారు. వారు ఆయన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇంకా ఎక్కువ చేయాలని కోరుకున్నారు, కానీ అది దాదాపు విశ్రాంతిదినము. వారు విశ్రాంతిదినము తర్వాత తిరిగి వచ్చి ముగించాలని ప్రణాళిక వేసుకున్నారు.
లూకా 23:52–56
యేసు మరణించిన మూడవ రోజు తెల్లవారుజామున, మగ్దలేనే మరియ మరియు ఇతరులు సమాధి వద్దకు వెళ్ళారు.
లూకా 24:1; యోహాను 20:1
వారు అక్కడికి చేరుకునేసరికి, సమాధిని కప్పి ఉంచిన రాయి తీసివేయబడి ఉండటం చూశారు. వారు సమాధిలోకి వెళ్ళారు, మరియు యేసు శరీరం అక్కడ లేదు.
లూకా 24:2–3; యోహాను 20:1
మరియ పేతురు మరియు యోహానులకు యేసు శరీరాన్ని ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్పడానికి పరిగెత్తింది. పేతురు మరియు యోహాను సమాధి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళారు.
యోహాను 20:2–4
వారు సమాధి దగ్గరకు వచ్చినప్పుడు, పేతురు మరియు యోహాను లోపలికి వెళ్ళారు. యేసు శరీరం లేదని వారు చూశారు. ఆయనకు చుట్టబడిన గుడ్డ ఇంకా అక్కడే ఉంది.
యోహాను 20:5–7
పేతురు మరియు యోహాను ఇంటికి వెళ్ళారు, కానీ మరియ సమాధి దగ్గర ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె సమాధిలోకి చూసింది, ఇద్దరు దేవదూతలు కనిపించారు. వాళ్ళు ఆమెను ఎందుకు ఏడుస్తోందని అడిగారు. యేసు శరీరాన్ని ఎవరో తీసుకెళ్లారని, అది ఎక్కడ ఉందో తనకు తెలియదని ఆమె చెప్పింది.
యోహాను 20:11–13
తరువాత యేసు వచ్చారు, కానీ మరియకు అది ఆయనే అని తెలియదు. యేసు ఆమెను, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు. మరియ ఆయన తోటమాలి అని అనుకుంది. యేసు శరీరం ఎక్కడ ఉందో ఆయనకు తెలుసా అని ఆమె ఆయనను అడిగింది.
యోహాను 20:14–15
యేసు, “మరియా” అని అన్నారు. ఆమె వెనక్కి తిరిగింది. ఇప్పుడు ఆమె యేసు అని తెలుసుకుంది! ఆమె ఆయనతో, “ప్రభువా” అంది. తన పరలోక తండ్రి దగ్గరకు వెళ్ళవలసిన అవసరం ఉందని ఇతర శిష్యులకు చెప్పమని యేసు ఆమెను అడిగారు. మరియ ఇతర శిష్యులను కనుగొని, తాను యేసును చూశానని మరియు ఆయన మళ్ళీ బ్రతికాడని వారితో చెప్పింది!
యోహాను 20:16–18
ఆ సాయంత్రం, అనేకమంది అపొస్తలులు కలిసి ఉన్నారు. యూదుల నాయకులు తమను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారనే భయంతో వారు తలుపులు మూసుకున్నారు. అకస్మాత్తుగా, యేసు వారి మధ్య నిలబడి ఉండటం వారు చూశారు. మొదట్లో వారు భయపడ్డారు. వారు ఆయనను ఒక ఆత్మ అని అనుకున్నారు. యేసు, “మీకు శాంతి కలుగుగాక” అన్నారు.
లూకా 24:33–38; యోహాను 20:19
యేసు తన చేతులు మరియు కాళ్ళను తాకమని అపొస్తలులను ఆహ్వానించారు. తనకు ఆత్మ మాత్రమే కాదు, శరీరము కూడా ఉందని వారు తెలుసుకోవాలని ఆయన కోరుకున్నారు. వాటితో పాటు చేపలు మరియు తేనె కూడా తిన్నారు. ఆయనను చూచి అత్యానంద పడిరి!
లూకా 24:39–44; యోహాను 20:20
తరువాత యేసు తన మరణం మరియు పునరుత్థానం గురించి బోధించే లేఖనాలను అర్థం చేసుకోవడానికి తన అపొస్తలులకు సహాయం చేశారు. తన వల్లే వారు పశ్చాత్తాపపడి క్షమాపణ పొందవచ్చని అందరికీ బోధించాలని ఆయన కోరుకున్నారు. అపొస్తలులు ఆయనకు సాక్షులుగా ఉంటారు.
లూకా 24:44–48
యేసు వచ్చినప్పుడు అపొస్తలుడైన తోమా అక్కడ లేడు. ఆయన చేతుల్లోని మేకుల గుర్తులను చూడకపోతే యేసు బ్రతికి ఉన్నాడని నమ్మనని అతను చెప్పాడు.
యోహాను 20:24–25
ఎనిమిది రోజుల తరువాత, శిష్యులు సమావేశమయ్యారు. యేసు మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఈసారి తోమా అక్కడ ఉన్నాడు.
యోహాను 20:26
యేసు తన చేతుల్లోనూ, ప్రక్కలోనూ ఉన్న గాయాలను ముట్టమని తోమాను ఆహ్వానించారు. ఆయన తోమాతో, “అవిశ్వాసిగా ఉండక, విశ్వాసిగా ఉండుము” అని అన్నారు. తోమా, “నా ప్రభువా, నా దేవా” అన్నాడు. ఇప్పుడు తోమా యేసు పునరుత్థానం పొందాడని నమ్మాడు. తనను చూడకపోయినా, ప్రజలు విశ్వసించినప్పుడు వారు ధన్యులు అని యేసు చెప్పారు.
యోహాను 20:27–29