లేఖన కథలు
రక్షకుడు జన్మించాడు—దేవుని వాగ్దానం నెరవేరింది


లూకా 2; మత్తయి 2:1–15

రక్షకుడు జన్మించాడు

దేవుని వాగ్దానం నెరవేరింది

బేత్లెహేముకు ప్రయాణిస్తున్న యోసేపు మరియు మరియ.

యోసేపు మరియు మరియ నజరేతులో నివసించేవారు. మరియకు త్వరలో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు. పన్ను చెల్లించడానికి అందరూ తమ స్వస్థలాలకు వెళ్లవలసి వచ్చింది. దీని అర్థం యోసేపు మరియు మరియ యోసేపు స్వస్థలమైన బేత్లెహేముకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి చేరుకోవడానికి వారు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చింది.

లూకా 2:1–5

బేత్లెహేములో మరియ మరియు యోసేపు.

మరియకు ప్రయాణం అంత సులభంగా లేదు. చాలా మంది బేత్లెహేముకు వచ్చినందున, మరియ బిడ్డను కనడానికి, మరియ మరియు యోసేపులకు స్థలం దొరకలేదు.

లూకా 2:6–7

శిశువైన యేసును ఎత్తుకున్న మరియ మరియు యోసేపు.

సాధారణంగా జంతువులను ఉంచే స్థలాన్ని వారు కనుగొన్నారు. ఈ వినయపూర్వకమైన ప్రదేశంలో, యేసు జన్మించారు. మరియ మరియు యోసేపు శిశువైన యేసును ప్రేమించి, శ్రద్ధగా చూసుకున్నారు. ఆయన వెచ్చగా మరియు సౌకర్యంగా ఉండేందుకు వస్త్రంతో చుట్టారు. వారు ఆయనను ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టి నిద్రపుచ్చారు, ఆ తొట్టిని సాధారణంగా జంతువుల మేత కొరకు ఉపయోగించేవారు.

లూకా 2:6–7

గొర్రెల కాపరుల గుంపుకు ఒక దేవదూత కనిపించడం.

సమీపంలో, గొర్రెల కాపరులు రాత్రిపూట తమ గొర్రెలను కాస్తున్నారు. అకస్మాత్తుగా, వారి చుట్టూ ఒక ప్రకాశవంతమైన వెలుగు ప్రకాశించింది మరియు ఒక దేవదూత కనిపించాడు. గొర్రెల కాపరులు భయపడ్డారు.

యేసు ఇప్పుడే పుట్టాడని గొర్రెల కాపరులకు చెబుతున్న దేవదూత.

దేవదూత వాళ్ళతో భయపడవద్దని చెప్పాడు, ఎందుకంటే అతని దగ్గర అద్భుతమైన వార్త ఉంది! రక్షకుడు బెత్లెహేములో జన్మించారు మరియు వారు పశువుల తొట్టిలో పండుకొనియున్న ఆయనను చూడగలిగారు. తరువాత చాలామంది దేవదూతలు వచ్చి, “సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక.” అని చెప్పసాగిరి.

లూకా 2:10–15

శిశువైన యేసును పలకరిస్తున్న గొర్రెల కాపరులు.

దేవదూత చెప్పినట్లుగానే, గొర్రెల కాపరులు బేత్లెహేముకు త్వరగా వెళ్లి శిశువైన యేసును కనుగొన్నారు. వారు చూసిన మరియు విన్న అద్భుతమైన విషయాల గురించి ప్రజలకు చెప్పారు. యేసు ఒక ప్రత్యేకమైన బిడ్డ అని వారికి తెలుసు.

లూకా 2:16–17

శిశువువైన యేసును ఎత్తుకొనియున్న సుమెయోను

మరియ మరియు యోసేపు శిశువువైన యేసును దేవునికి సమర్పించడానికి దేవాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ వారు సుమెయోను అనే వ్యక్తిని కలిశారు. సుమెయోను చనిపోయే ముందు రక్షకుడిని కలుస్తాడని పరిశుద్ధాత్మ అతనికి చెప్పింది. అతను బిడ్డను ఎత్తుకుని, దేవుని పిల్లలందరినీ యేసు రక్షిస్తాడని చెప్పాడు. ఆయన చెప్పిన దానికి యోసేపు, మరియలు ఆశ్చర్యపోయారు.

లూకా 2:22–35

శిశువువైన యేసును కలుసుకున్న అన్న.

ఆ దేవాలయంలో అన్న అనే మరొక వ్యక్తి ఉంది. ఆమె భర్త చాలా సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఇప్పుడు అన్న తన సమయమంతా దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడంలో గడుపుతోంది. రక్షకుడిని కలిసే అవకాశం ఇచ్చినందుకు ఆమె దేవునికి కృతజ్ఞతలు తెలిపింది. రక్షకుని కోసం ఎదురుచూస్తున్న వారిని కలిసినప్పుడల్లా, ఆమె వారికి యేసు గురించి చెప్పేది.

లూకా 2:36–38

ఆకాశంలో కొత్త నక్షత్రం కనిపించడాన్ని చూస్తున్న జ్ఞానులు.

యేసు జన్మించినప్పుడు, మరొక దేశంలోని జ్ఞానులు ఒక కొత్త నక్షత్రాన్ని చూశారు. దేవుని కుమారుడు మరియు లోక రక్షకుడైన ఒక ప్రత్యేక శిశువు జన్మించాడని వారికి తెలుసు. వారు ఈ బిడ్డను సందర్శించి, ఆయనను ఆరాధించడానికి సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించారు. ఆయన పట్ల తమకున్న ప్రేమను చూపించడానికి వారు ఆయనకు బహుమతులు తీసుకురావాలనుకున్నారు.

మత్తయి 2:1–7;.

యెరూషలేములో రక్షకుని కోసం వెతుకుతున్న జ్ఞానులు.

చాలా కాలం ప్రయాణించిన తర్వాత, ఆ జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. యూదుల కొత్త రాజు, రక్షకుడు జన్మించాడని, ఆయనను ఆరాధించడానికి వచ్చారని వారు చెప్పారు. వారు కొత్త రాజును ఎక్కడ కనుగొనగలరని అడిగారు.

మత్తయి 2:1–2

కొత్త రాజును కనుగొనమని తన మనుషులకు చెబుతున్న హేరోదు.

జ్ఞానులు కొత్త రాజు కోసం వెతుకుతున్నారని హేరోదు అనే రాజు విన్నాడు. అతను ఆందోళన చెందాడు. అతని యాజకులు మరియు శాస్త్రులు కొత్త రాజు బెత్లెహేములో పుడతాడని లేఖనాలు చెబుతున్నాయని అతనికి చెప్పారు. బేత్లెహేములో చూసి, తిరిగి వచ్చి కొత్త రాజును ఎప్పుడు కనుగొన్నారో చెప్పమని హేరోదు జ్ఞానులతో చెప్పాడు.

మత్తయి 2:3–8

శిశువువైన యేసును పూజిస్తున్న జ్ఞానులు.

జ్ఞానులు బేత్లెహేముకు వచ్చారు. వారు ఆ నక్షత్రాన్ని అనుసరించారు, అది వారిని యేసు దగ్గరకు నడిపించింది. వారు ఆయనను, మరియను, యోసేపును కనుగొన్నప్పుడు, వారు యేసుకు మూడు ప్రత్యేక బహుమతులు ఇచ్చి ఆయనను ఆరాధించారు. హేరోదు దగ్గరకు తిరిగి వెళ్ళవద్దని దేవుడు వారిని హెచ్చరించారు, కాబట్టి వారు వేరే దారిలో ఇంటికి వెళ్లిపోయారు.

మత్తయి 2:9–12

యోసేపు తన కుటుంబాన్ని ఐగుప్తుకు తీసుకెళ్లాలని చెబుతున్నఒక దేవదూత.

జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత, యోసేపుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక దేవదూత యోసేపుతో హేరోదు కోపంగా ఉన్నాడని చెప్పాడు. మరియను మరియు యేసును సురక్షితంగా ఉంచడానికి యోసేపు వారిని ఐగుప్తుకు తీసుకెళ్లవలసి వచ్చింది.

మత్తయి 2:13

యోసేపు, మరియ మరియు యేసు ఐగుప్తుకు బయలుదేరుతున్నారు.

యోసేపు వెంటనే లేచాడు. ఇంకా రాత్రివేళ ఉండగానే అతను, మరియ మరియు యేసుతో కలిసి ఐగుప్తుకు బయలుదేరాడు.

మత్తయి 2:14

ఇంటి వద్ద యోసేపు, మరియ మరియు యేసు.

హేరోదు చనిపోయాడని మరియు తిరిగి రావడం సురక్షితమని దేవదూత వారికి చెప్పే వరకు మరియ, యోసేపు మరియు యేసు ఐగుప్తులోనే ఉన్నారు. తరువాత వారు నజరేతులో నివసించడానికి తిరిగి వెళ్ళారు.

మత్తయి 2:15, 19–23