లేఖన కథలు
యేసు బంధించబడ్డారు—దేవుని కుమారునికి తీర్పు తీర్చుట


మార్కు 14–15; లూకా 22–23; యోహాను 18–19

యేసు బంధించబడ్డారు

దేవుని కుమారునికి తీర్పు తీర్చుట

యూదా మరియు కొంతమంది కాపలాదారులు గెత్సేమనే వద్దకు చేరుకుంటారు.

యేసు గెత్సేమనేలో ప్రార్థన చేసి శ్రమలు అనుభవించిన తర్వాత, యూదా పెద్ద సంఖ్యలో యూదుల కాపలాదారులతో అక్కడికి వచ్చాడు. యూదా అపొస్తలులలో ఒకడు. యేసు తరచుగా ఈ తోటకి వెళ్తాడని అతనికి తెలుసు. యూదుల నాయకులు యేసును పట్టుకుని తీసుకెళ్లడానికి ఆయనను కనుగొనడంలో సహాయం చేయమని యూదాకు డబ్బు చెల్లించారు.

యోహాను 18:2–3

పేతురు ప్రధాన యాజకుని సేవకుడిపై దాడి చేస్తాడు.

కాపలాదారులు యేసును తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, పేతురు కత్తిని తీశాడు. అతను ప్రధాన యాజకుని సేవకుడి చెవి నరికివేశాడు.

యోహాను 18:10

యేసు పేతురుతో కత్తిని పక్కన పెట్టమని చెబుతున్నారు.

యేసు పేతురుతో కత్తిని పక్కన పెట్టమని చెప్పారు. తన తండ్రి కోరినది తాను చేయాలని యేసు చెప్పారు.

యోహాను 18:11

యేసు సేవకుడి చెవిని స్వస్థపరిచారు.

యేసు ఆ సేవకుడి చెవిని తాకి స్వస్థపరిచారు.

లూకా 22:51

యేసును ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్తారు.

ఆ కాపలాదారులు యేసును ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్లారు. ఇతర యూదుల నాయకులు కూడా అక్కడ ఉన్నారు. వారు యేసును చంపడానికి ఒక కారణం వెతకాలనుకున్నారు. ఆయన గురించి అబద్ధాలు చెప్పడానికి వారు ప్రజలను తీసుకువచ్చారు.

మార్కు 14:53–61

ప్రధాన యాజకుడు యేసును, నీవు దేవుని కుమారుడవా అని అడుగుతాడు.

చివరికి, ప్రధాన యాజకుడు యేసును దేవుని కుమారుడా అని అడిగాడు. యేసు, "అవును" అని చెప్పెను.

మార్కు 14:61–62

ప్రధాన యాజకుడు మరియు ఇతర నాయకులు యేసు మీద కోపంగా ఉన్నారు.

దీనితో ప్రధాన యాజకునికి మరియు ఇతర నాయకులకు కోపం వచ్చింది. వారు యేసును కొట్టారు, ఆయన మీద ఉమ్మివేశారు, ఆయనను ఎగతాళి చేశారు. ఆయన చంపబడాలని వారు అంగీకరించారు.

మార్కు 14:63–65

తనకు యేసు ఎవరో తెలియదని పేతురు ప్రజలకు చెప్పాడు.

యేసు ప్రధాన యాజకుని ఇంట్లో ఉన్నప్పుడు, పేతురు బయట వేచి ఉన్నాడు. అతను చలి కాచుకోవడానికి నిప్పు దగ్గర కూర్చున్నాడు. మూడుసార్లు, ప్రజలు పేతురును యేసు శిష్యులలో ఒకనిగా గుర్తించామని చెప్పారు. కానీ ప్రతిసారీ పేతురు తనకు యేసు తెలియదని అన్నాడు.

మార్కు 14:54, 66–71

పేతురు ఏడుస్తూ వెళ్ళిపోయాడు.

అప్పుడు కోడి కూసింది: పేతురు మూడుసార్లు తనను తిరస్కరించాడని పేతురు యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. పేతురు ఏడుస్తూ వెళ్ళిపోయాడు.

మార్కు 14:72

యూదుల నాయకులు యేసును పిలాతు దగ్గరకు తీసుకెళ్తారు.

యూదుల నాయకులు యేసును రోమా గవర్నరు పిలాతు దగ్గరకు తీసుకెళ్లారు. జనం కూడా గుంపుగా వచ్చారు. పిలాతు యేసును చంపాలని నాయకులు కోరుకున్నారు. యేసు తనను తాను యూదుల రాజు అని చెప్పుకున్నాడని వారు పిలాతుతో చెప్పారు.

మార్కు 15:1–3; లూకా 23:2; యోహాను 18:28–31

యేసు పిలాతుతో మాట్లాడుతున్నారు.

పిలాతు యేసును యూదుల రాజువా అని అడిగాడు. యేసు ఇలా అన్నారు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు.” ప్రజలకు సత్యాన్ని బోధించడానికే తాను ఈ లోకానికి వచ్చానని ఆయన వివరించారు.

యోహాను 18:33–37

యేసు మరియు పిలాతు జనసమూహము ముందు నిలుచున్నారు.

యేసు ఏ తప్పు చేయలేదని పిలాతు నమ్ముతున్నాడు. కానీ చాలామంది, “ఆయనను సిలువ వేయండి” అని కేకలు వేశారు. పిలాతు వారు కోరుకున్నట్లు చేయాలని నిర్ణయించి, యేసును చంపమని ఆజ్ఞాపించాడు.

మార్కు 15:12–14; లూకా 23:14–24