లేఖన కథలు
బేతెస్ద కోనేరు వద్ద యేసు—చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరచడం


యోహాను 5:1–17

బేతెస్ద కోనేరు వద్ద యేసు

చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరచడం

బేతెస్ద కోనేరు వద్ద ప్రజలు గుమ్మిగూడారు.

యెరూషలేములో, బేతెస్ద కోనేరు అనే స్థలం ఉంది. ఈ కోనేరుకు స్వస్థపరిచే శక్తి ఉందని ప్రజలు విశ్వసించారు. రోగులు, గ్రుడ్డివారు, లేదా నడవలేని వారు చాలా మంది ఈ కోనేరు వద్దకు వచ్చేవారు.

యోహాను 5:2–3

స్వస్థత పొందడానికి నీటిలోకి దిగుతున్న ప్రజలు.

కొన్ని సమయాల్లో ఒక దేవదూత దిగి వచ్చి కోనేటిలో నీళ్లు కదలించిందని ప్రజలు నమ్మేవారు. నీరు కదలిన తర్వాత అందులో మొదట దిగిన వ్యక్తి, తనకు ఉన్న ఏ జబ్బు అయినా నయమవుతుంది. చాలా మంది కోనేటిలోకి మొదటిగా దిగాలని ప్రయత్నించారు.

యోహాను 5:4

ఒక జబ్బుపడిన వ్యక్తి కోనేరు దగ్గర పడి ఉన్నాడు.

ఆ కోనేరు దగ్గర ఉన్న వారిలో ఒకడు నడవలేని వ్యక్తి. అతను 38 సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్నాడు. అతను స్వస్థత పొందడానికి కోనేరులో దిగాలని అనుకున్నాడు, కానీ అతను ప్రయత్నించినప్పుడల్లా, మరొకరు ముందుగా లోపలికి దిగేవారు.

యోహాను 5:5–7

యేసు ఆ రోగిని గమనిస్తారు.

ఒక విశ్రాంతిదినమున యేసు యెరూషలేములో ఉన్నారు. ఆయన పట్టణం గుండా నడుస్తూ, బేతెస్ద కోనేరు దగ్గరకు వచ్చి, అక్కడ పడి ఉన్న వ్యక్తిని చూశారు.

యోహాను 5:6

యేసు ఆ వ్యక్తిని స్వస్థత పొందాలనుకుంటున్నావా అని అడుగుతారు.

ఆ మనిషి చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నాడని మరియు నడవలేడని యేసుకు తెలుసు. యేసు ఆ వ్యక్తిని స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా అని అడిగారు.

యోహాను 5:6

తనకు సహాయం చేయడానికి ఎవరూ లేరని ఆ మనిషి యేసుతో చెప్పాడు.

ఆ వ్యక్తి యేసుతో, తనను కోనేటిలో దించడానికి ఎవరూ లేరని, నీళ్లు కదిలించబడినప్పుడు తనకంటే ముందే ఇతరులు లోపలికి దిగుతారు అని చెప్పాడు.

యోహాను 5:7

యేసు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తారు.

“నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని”, యేసు వానితో చెప్పెను వెంటనే ఆ మనుష్యుడు స్వస్థపరచబడెను! తరువాత అతను లేచి నిలబడి తన పరుపు ఎత్తుకున్నాడు. 38 సంవత్సరాలలో మొదటిసారిగా, అతను నడవగలిగాడు!

యోహాను 5:8–9

నాయకులు ఆ వ్యక్తిని విశ్రాంతిదినమున ఆయన ఎందుకు పని చేస్తున్నాడని అడిగారు.

ఆ వ్యక్తి తన పరుపును మోసుకెళ్ళడం యూదుల నాయకులు చూశారు. ఆయన విశ్రాంతిదినమును గౌరవించడం లేదని వారు అన్నారు, ఎందుకంటే అతను తన పరుపును మోసుకెళ్ళడం పని చేయడం లాంటిదని వారు భావించారు. ఆ వ్యక్తి తాను ఇప్పుడే స్వస్థత పొందానని మరియు అతన్ని స్వస్థపరిచిన వ్యక్తి తన పరుపును మోసుకెళ్ళమని చెప్పాడనని వివరించాడు.

యోహాను 5:10–11

యేసు విశ్రాంతిదినమున స్వస్థపరుస్తున్నందుకు నాయకులు ఆయనపై కోపంగా ఉన్నారు.

ఆ వ్యక్తిని స్వస్థపరిచింది యేసు అని మరియు విశ్రాంతిదినమున అతనిని పరుపు మోసుకెళ్ళమని చెప్పాడని నాయకులు కనుగొన్నారు. వారు యేసు మీద కోపంగా ఉండి ఆయనను చంపాలనుకున్నారు. తన పరలోక తండ్రి తనకు నేర్పించిన పనులను మాత్రమే తాను చేస్తున్నానని యేసు వారితో చెప్పారు.

యోహాను 5:15–17