లేఖన కథలు
నీటి మీద నడవడం—విశ్వాసం భయాన్ని జయిస్తుంది


మత్తయి 14:22–33

నీటి మీద నడవడం

విశ్వాసం భయాన్ని జయిస్తుంది

గలిలయ సముద్రంలో పడవవైపు చూస్తున్న యేసు.

యేసు కొంత సమయం ఒంటరిగా ప్రార్థన చేయాలనుకున్నారు. ఆయన తన శిష్యులను పడవలో గలిలయ సముద్రం అవతలి ఒడ్డుకు పంపారు. యేసు ఒక కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళారు.

మత్తయి 14:22–23

అపొస్తలులు తుఫానులో చిక్కుకున్నారు.

ఆ రాత్రి, గాలి బలంగా వీచింది, అలలు పెద్దగా ఎగసిపడ్డాయి. యేసు యొక్క శిష్యులు పడవను సముద్రం అవతలి ఒడ్డుకు చేర్చడానికి రాత్రంతా కష్టపడి పనిచేశారు.

మత్తయి 14:24–25

యేసు నీటి మీద నడుచుకుంటూ వారి వైపుకు వస్తున్నట్లు అపొస్తలులు చూశారు.

రాత్రి దాదాపు ముగిసే సమయానికి, శిష్యులు ఎవరో నీటి మీద తమ వైపు నడుచుకుంటూ రావడం చూశారు. వాళ్ళు దెయ్యం అనుకుని భయపడ్డారు. అది దెయ్యం కాదు; యేసు! ఆయన వారిని పిలిచి, “ధైర్యము తెచ్చుకొనుడి, నేనే; భయపడకుడని” చెప్పెను.

మత్తయి 14:25–27

యేసు పేతురును నీళ్లపై తన దగ్గరకు రమ్మని ఆహ్వానించారు.

నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని పేతురు యేసుతో అనెను, యేసు “రమ్ము!” అని చెప్పారు, పేతురు పడవ దిగి, యేసు మాదిరిగానే నీటి మీద నడవడం ప్రారంభించాడు!

మత్తయి 14:28–29

పేతురు భయపడి మునిగిపోవడం ప్రారంభించాడు.

కానీ పేతురు బలమైన గాలిని, పెద్ద అలలను చూసినప్పుడు భయపడ్డాడు. అతను నీటిలో మునిగిపోసాగెను. అతను యేసును, “ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.”

మత్తయి 14:30

యేసు పేతురు వైపు చేయి చాపారు.

యేసు చెయ్యి చాపి పేతురును పట్టుకున్నారు. మిక్కిలిగా విశ్వసించే బదులు ఎందుకు సందేహిస్తున్నావని ఆయన పేతురును అడిగారు.

మత్తయి 14:31

యేసు మరియు పేతురు పడవలోకి తిరిగి వచ్చారు.

యేసు మరియు పేతురు పడవ ఎక్కగానే గాలి ఆగిపోయింది. జరిగిన దానిని చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. యేసు నిజంగా దేవుని కుమారుడని వారికి తెలుసు మరియు వారు ఆయనను ఆరాధించారు.

మత్తయి 14:32–33