మత్తయి 14:22–33
నీటి మీద నడవడం
విశ్వాసం భయాన్ని జయిస్తుంది
యేసు కొంత సమయం ఒంటరిగా ప్రార్థన చేయాలనుకున్నారు. ఆయన తన శిష్యులను పడవలో గలిలయ సముద్రం అవతలి ఒడ్డుకు పంపారు. యేసు ఒక కొండ మీద ప్రార్థన చేయడానికి వెళ్ళారు.
మత్తయి 14:22–23
ఆ రాత్రి, గాలి బలంగా వీచింది, అలలు పెద్దగా ఎగసిపడ్డాయి. యేసు యొక్క శిష్యులు పడవను సముద్రం అవతలి ఒడ్డుకు చేర్చడానికి రాత్రంతా కష్టపడి పనిచేశారు.
మత్తయి 14:24–25
రాత్రి దాదాపు ముగిసే సమయానికి, శిష్యులు ఎవరో నీటి మీద తమ వైపు నడుచుకుంటూ రావడం చూశారు. వాళ్ళు దెయ్యం అనుకుని భయపడ్డారు. అది దెయ్యం కాదు; యేసు! ఆయన వారిని పిలిచి, “ధైర్యము తెచ్చుకొనుడి, నేనే; భయపడకుడని” చెప్పెను.
మత్తయి 14:25–27
నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని పేతురు యేసుతో అనెను, యేసు “రమ్ము!” అని చెప్పారు, పేతురు పడవ దిగి, యేసు మాదిరిగానే నీటి మీద నడవడం ప్రారంభించాడు!
మత్తయి 14:28–29
కానీ పేతురు బలమైన గాలిని, పెద్ద అలలను చూసినప్పుడు భయపడ్డాడు. అతను నీటిలో మునిగిపోసాగెను. అతను యేసును, “ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.”
మత్తయి 14:30
యేసు చెయ్యి చాపి పేతురును పట్టుకున్నారు. మిక్కిలిగా విశ్వసించే బదులు ఎందుకు సందేహిస్తున్నావని ఆయన పేతురును అడిగారు.
మత్తయి 14:31
యేసు మరియు పేతురు పడవ ఎక్కగానే గాలి ఆగిపోయింది. జరిగిన దానిని చూసి శిష్యులు ఆశ్చర్యపోయారు. యేసు నిజంగా దేవుని కుమారుడని వారికి తెలుసు మరియు వారు ఆయనను ఆరాధించారు.
మత్తయి 14:32–33