“పరిశుద్ధులు పశ్చిమానికి ప్రయాణిస్తున్నారు” ఫ్రెండ్, 2025 డిసెంబరు, 26–28.
ఫ్రెండ్ నెలవారీ సందేశం, 2025 డిసెంబరు
పరిశుద్ధులు పశ్చిమానికి ప్రయాణిస్తున్నారు
జోసెఫ్ స్మిత్ మరణించిన తరువాత, బ్రిగమ్ యంగ్ మరియు ఇతర అపొస్తలులు సంఘమును నడిపించారు. నౌవూ సురక్షితం కానందున పరిశుద్ధులు దానిని వదిలి వెళ్ళవలసి వస్తుంది అని బ్రిగమ్కు తెలుసు. కానీ వారు ముందుగా దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభువు కోరుకున్నారు.
దేవాలయం సిద్ధమైనప్పుడు, వేలాది మంది పరిశుద్ధులు ప్రభువుతో నిబంధనలు చేసుకున్నారు మరియు కుటుంబాలుగా ముద్రించబడ్డారు.
ఇప్పుడు వారి పశ్చిమ ప్రయాణాన్ని ప్రారంభించే సమయం ఆసన్నమైంది. వాతావరణం చల్లగా ఉంది మరియు ప్రజలు అనారోగ్యంతో, ఆకలితో అలమటించారు.
బ్రిగమ్ సహాయం కోసం ప్రార్థించారు. వారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, అప్పుడు వారిని ఆశీర్వదించి మరియు వారికి సహాయం చేస్తానని ప్రభువు చెప్పారు.
ప్రయాణం ఇంకా చాలా కష్టంగా ఉంది. కొంతమంది చనిపోయారు. కానీ వారి దేవాలయ నిబంధనల కారణంగా, వారు తమ కుటుంబ సభ్యులను మళ్ళీ చూస్తారని పరిశుద్ధులకు తెలుసు.
మొదటి పరిశుద్ధులు 1847లో సాల్ట్ లేక్ లోయకు చేరుకున్నారు. ఇక్కడ వారు ప్రభువును ఆరాధించవచ్చు మరియు ఆయన పనిని ప్రశాంతంగా చేయవచ్చు.
సంవత్సరాలు గడిచేకొద్దీ, మరింత మంది పరిశుద్ధులు వచ్చి, మరిన్ని దేవాలయాలను నిర్మించారు. యేసు క్రీస్తు యొక్క సువార్తను బోధించడానికి సువార్తికులు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించారు. ప్రతిచోటా పరలోక తండ్రి పిల్లలను ఆశీర్వదిస్తూ, రక్షకుని సంఘము పెరుగుతూనే ఉంది.
రంగులు వేసే పేజీ
ఆయనే లోకమునకు వెలుగును, జీవమును, నిరీక్షణయైయున్నాడు
కోరీ ఎగ్బర్ట్ చేత వివరణ
క్రిస్మస్ సమయంలో యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఏమి చేస్తారు?
© 2025 by Intellectual Reserve, Inc. All rights reserved. అ.సం.రా. లో ముద్రించబడినది. ఆంగ్ల ఆమోదము: 6/19. అనువాద ఆమోదము: 6/19. Monthly Friend Message, December 2025 యొక్క అనువాదము. Telugu. 19637 421